తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించడమే కాకుండా, నియామకాల కోసం గరిష్ఠ వయోపరిమితిని కూడా పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిదని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివలన మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కలగనుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ