దేశంలో ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు (మార్చి 10, గురువారం) జరగనుంది. కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే కౌంటింగ్ పక్రియ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్స్ పాటించాల్సిన నిబంధనలపై కూడా ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో 403, గోవాలో 40, పంజాబ్ లో 117, మణిపూర్ లో 60, ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మినీ సంగ్రామంగా పేర్కొంటున్న ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకుంది. బీజేపీ అన్ని చోట్లా సత్తా చాటుతుందా?, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా?, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీల వైపు మొగ్గుచూపారా? లేక కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఉత్తర్ ప్రదేశ్ లో మళ్ళీ బీజేపీ అధికారం దక్కించుకుంటుందని, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించబోతుందని అంచనా వేశాయి. అలాగే గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లలో కూడా బీజేపీకే కొద్దిగా మొగ్గుచూపాయి. కాగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని, ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతుందని ఎక్కువశాతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ