తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కొత్త మండలాల ఏర్పాటుపై గత జూలై 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ పై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తాజాగా 8 జిల్లాల్లో మొత్తం 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేసింది. నిజామాబాద్ జిల్లాలో 3 మండలాలు, సిద్దిపేటలో 3, మహబూబాబాద్ లో 2, జగిత్యాలలో 2, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ లో 1 చొప్పున కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ సెప్టెంబర్ 26, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాల వారీగా కొత్తగా ఏర్పాటు చేసిన 13 రెవిన్యూ మండలాలు ఇవే:
- జగిత్యాల జిల్లా – ఎండపల్లి , భీమారం
- సంగారెడ్డి జిల్లా – నిజాంపేట్
- నల్లగొండ జిల్లా – గట్టుప్పల్
- మహబూబాబాద్ జిల్లా – సీరోలు, ఇనుగుర్తి
- సిద్దిపేట జిల్లా – అక్బర్ పేట్, భూంపల్లి, కుకునూరుపల్లి
- కామారెడ్డి జిల్లా – డోంగ్లి
- మహబూబ్ నగర్ – కౌకుంట్ల
- నిజామాబాదు జిల్లా – ఆలూర్, డొంకేశ్వర్ , సాలూరా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY