తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంగీకరించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో మాసాయిపేట మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు తుది నోటిఫికేషన్ జారీచేసింది. చేగుంట మండలంలోని 3 గ్రామాలైన చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్పల్లి మరియు ఎల్దుర్తి మండలంలోని 6 గ్రామాలైన మాసాయిపేట, రామాంతపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి లతో కలిపి మొత్తం 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ