తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా, ఉద్యోగ రంగాల్లో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 17న ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జీవో ప్రకారం రాష్ట్రంలో ఇది నేటి నుంచే అమలులోకి రానుంది. దీంతో తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 54 శాతానికి చేరుకోనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పెంచిన కోటా తక్షణమే అమల్లోకి రానుంది.
కాగా తెలంగాణాలో ఎస్టీ, ముస్లిం (బీసీ-ఈ కేటగిరీ) రిజర్వేషన్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. గిరిజనులు అధికంగా ఉండటం మూలంగా తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనికి ముందు రిజర్వేషన్ల పెంపు అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ చెల్లప్ప నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్ 15న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించగా, ఆ మరుసటి రోజు శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY