తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వంట పని చేస్తున్న వారికి గౌరవ వేతనం పెంచింది. ఈ మేరకు శనివారం జీవోను జారీ చేసింది. ప్రతి నెలా వారికి అందిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ. 3,000కి పెంచుతున్నట్లు ప్రకటించింది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంతో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట మనిషితో పాటు ఇతర సహాయకులకు కూడా పెరిగిన వేతనం అందనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54,201 మంది మధ్యాహ్న భోజనం కింద వంట మనిషి, సహయకులకు పెంచిన వేతనం త్వరలో అందించనున్నట్లు విద్యాశాఖ సెక్రటరీ కరుణ వాకాటి వెల్లడించారు. కాగా గతంలో వీరికి అందజేస్తున్న రూ.1,000లలో.. కేంద్రం వాటాగా రూ.600 ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 చెల్లించేది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను రూ.400 నుంచి ఒకేసారి రూ.2,400కు పెంచింది. దీనిపై వంట కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE