తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ వేదికగా ఆయన విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు తమది కుటుంబ పాలనే అని, అయితే తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ కుటుంబానికి పెద్ద సీఎం కేసీఆర్ అని కుడా స్పష్టం చేశారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలను సొంత తోబుట్టువుల మాదిరి భావించి సంక్షేమ పథకాల ద్వారా ఆడుకుంటున్నది సీఎం కేసీఆర్ కాదా? అని మంత్రి ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కంటి వెలుగు వంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టి వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తున్నారని, గురుకులాలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేసి వారి భవిష్యత్ తీర్చిదిద్దుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. దురదృష్టవశాత్తూ ఒంటరిగా ఉంటున్న మహిళలకు సోదరుడి మాదిరి పెన్షన్లు ఇస్తున్నారని, పేద-ధనిక భేదాల్లేకుండా పుట్టిన పసి బిడ్డకు ఒక మేనమామ లాగా కేసీఆర్ కిట్ ద్వారా సకల సౌకర్యాలు అందిస్తున్నారని తెలియజేశారు. ఇక పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ కింద ఇంటి పెద్ద మాదిరి 12 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేశారని, అలాగే 65 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం కింద 65వేల కోట్లు ఇచ్చి అన్నగా సీఎం కేసీఆర్ నిలబడ్డారని వెల్లడించారు. తెలంగాణతో కేసీఆర్కు ఉన్న పేగుబంధాన్ని తెంపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE