తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 30నే జీవో 51 ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టుకు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనల సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946లోని సెక్షన్ 6 కింద జారీ చేసిన అన్ని మునుపటి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ ఆగస్టు 30న ప్రభుత్వ హోం (ప్రత్యేక) శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఏజీ కోర్టుకు తెలియజేశారు. గతంలో రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా సీబీఐకి అనుమతి ఇవ్వగా తాజాగా రద్దు చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏదైనా కేసులో దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE