రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మంగళవారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పట్టుబడిన ముగ్గురు నిందితులపై మొయినాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై విధించిన స్టేను కోర్టు ఎత్తేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు తదుపరి దర్యాప్తు చేసుకోవచ్చంటూ హైకోర్టు మంగళవారం అనుమతిచ్చింది. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో దర్యాప్తు కొనసాగకుండా ఎక్కువ రోజులు నిలివివేయడం సరికాదని పేర్కొంది. అలాగే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, నందకుమార్, సింహయాజీలను రిమాండ్కు తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం వారు చంచల్ గూడ జైల్లో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE