తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ఆధార్ వివరాలు అడగొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజల ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని, అయితే ఆధార్ వివరాలు మాత్రం సేకరించవద్దని కోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సాఫ్ట్వేర్లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్స్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. సాఫ్ట్వేర్లో మార్పులు చేసిన అనంతరం వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆధార్ వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగించుకోవచ్చని చెప్పింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కులం మరియు కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సవరణలకు సంబంధించి ప్రభుత్వం తరఫునుంచి సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు జనవరి 20కి వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ