రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్ లో పెండింగ్ ఉన్న ట్రాఫిక్ చలాన్ లపై రాయితీ ఇస్తున్నామని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలవారు, తోపుడు బండి వారు, పెండింగ్ చలాన్ మొత్తంలో 25% చెల్లిస్తే 75% మాఫీ, అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ 30% చెల్లిస్తే బ్యాలన్స్ 70% మాఫీ, ఎల్ఎంవీ/హెఛ్ఎంవీల వారు 50% చెల్లిస్తే బ్యాలన్స్ 50% మాఫీ అవుతుందనన్నారు. అలాగే మాస్క్ లు లేని కేసులలో రూ.100 చెల్లిస్తే రూ.900 మాఫీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
గత రెండు సంత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని హెూంమంత్రి తెలిపారు. దీనికోసం తెలంగాణ ఈచలాన్ వెబ్ సైట్ లో ఆన్లైన్ పేమెంట్ కి ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని, మార్చి 1 నుండి 31 వరకు ఎప్పుడైనా చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ