తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్షను ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఐసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఐసెట్ పరీక్షలో మొత్తం 90.09 శాతం మంది ఉత్తీర్ణులయినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్సైట్ https://icet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇక ఐసెట్ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్.లోకేశ్ మొదటి ర్యాంకు, పమిడి సాయి తనూజ రెండో ర్యాంకు, ఆర్.నవీనాక్షంత మూడో ర్యాంకు సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ