తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (బుధవారం) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల కారణంగా ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు ప్రైవేటు స్కూల్స్ అన్నింటికి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుపనున్నట్లు తెలిపింది. అలాగే, ఈ విద్యా సంవత్సరం (2021-22) ఆఖరి రోజు వరకు అనగా.. వేసవి సెలవులు ప్రకటించే వరకు ఇదే సమయాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే, మధ్యాహ్నం 12:30 గంటలకు తరగతులు పూర్తయిన అనంతరం, ఇంటికి వెళ్లే ముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నారు. అలాగే, మే నెలలో జరుగనున్న 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ