నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మార్చి 30, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసినట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్ ప్రకటించారు.
మరోవైపు దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈ రోజున జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3ను ఆఖరుతేదీగా నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. నామినేషన్ల పక్రియ ముగియడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నిక సందడి మొదలయింది. ఈ స్థానంలో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
నామినేషన్స్ దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:
- టీఆర్ఎస్ – నోముల భగత్ కుమార్
- కాంగ్రెస్ – జానారెడ్డి
- బీజేపీ – పానుగోతు రవికుమార్
- టీడీపీ – అరుణ్ కుమార్ మువ్వా
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ