తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభమయిన విషయం తెలిసిందే. నేటితో కలిపి మొత్తం ఏడు రోజుల పాటుగా సమావేశాలు జరగగా, శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తునట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ప్రకటించారు. సభ నిర్వహణ సజావుగా జరిగేందుకు సహకరించినందుకు సభ్యులకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.
7 రోజులు పాటుగా సాగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటుగా మొత్తం 4 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అలాగే 54 గంటల 47 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. చివరి రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ద్రవ్య వినిమయ బిల్లు-2022ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కీలక చర్చ, సీఎం కేసీఆర్ సమాధానం అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ