డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం ఒక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు 2022, నవంబర్ 9న మొత్తం 66,946 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 26,990 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.4.73 కోట్లు వచ్చినట్టు తెలిపారు. అలాగే స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE