రాష్ట్రంలో లాక్డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు, ఇతర జోన్లలో జూన్ 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తుట్టు ప్రకటించారు.
కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణాలో లాక్డౌన్ అమలులో తాజా మార్గదర్శకాలు:
- రాత్రి పూట కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు.
- ఆస్పత్రులు, ఔషధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలి.
- అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత.
- ఇతర రాష్ట్రాల రాకపోకలపై కూడా ఎలాంటి నియంత్రణ లేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu