తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వీటిలో 196 స్థానిక కేసులు కాగా, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. కొత్తగా నమోదైన 196 కేసులతో కలిపి మే 31, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2264 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 122 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ జిల్లాలో 10, ఖమ్మంలో 9, మహబూబ్నగర్, జగిత్యాల, మెదక్ జిల్లాలలో 3 చొప్పున, వరంగల్ అర్బన్లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున మొత్తం 196 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 82 కి చేరినట్టు తెలిపారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 434 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 434 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,698 కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1428 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1188 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 31.05.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/nEX1vLdMhA
— Eatala Rajender (@Eatala_Rajender) May 31, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu