తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సొంత నియోజకవర్గమైన పాలకుర్తిలో నేడు డబుల్ బెడ్రూమ్ (2బీహెచ్ కే) ఇళ్లను ప్రారంభించారు. పాలకుర్తిలోని దేవరుప్పుల మండలం సింగరాజు పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శనివారం ప్రారంభించారు. బెడ్రూమ్ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని అర్హులైన పేదలందరికీ ఆత్మగౌరవ ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని ప్రధాని కే చంద్రశేఖర్రావు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం వేల కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తోందని వెల్లడించారు. ఈ 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్లు మంత్రి దయాకర్ రావు తెలిపారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇద్దరు గొప్ప ముఖ్యమంత్రులను చూశానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. చిన్న వయసులో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావును చూశానని, ఉమ్మడి తెలుగు రాష్టంలో పేదలకు పింఛన్లు అందించిన తొలి వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఇక తనకు నచ్చిన రెండో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని తెలిపారు. పేదలకు రూ.2వేల పింఛన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని, అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. తెలంగాణలో పేద ప్రజలకోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతు బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇలా ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ