మలేరియా నియంత్రణలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తెలంగాణను కేంద్రం సత్కరించనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు కేంద్రం ఆహ్వానం పంపింది. మలేరియా నియంత్రణలో రాష్ట్రానికి లభించిన గుర్తింపు పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “మలేరియా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి మరోసారి దేశవ్యాప్త గుర్తింపు లభించింది.రాష్ట్రంలో గత ఆరేండ్లలో (2015-2021) మలేరియా కేసులు గణనీయంగా తగ్గి, రాష్ట్రం ప్రీ ఎలిమినేషన్ దశ (కేటగిరి 2) నుండి ఎలిమినేషన్ దశ (కేటగిరి 1) కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల పరిశుభ్రత పెరిగి మలేరియా తగ్గుముఖం పట్టింది. ఇదే స్పూర్తితో త్వరలోనే తెలంగాణను మలేరియా రహిత రాష్ట్రం(కేటగిరీ జీరో)గా చేయడానికి కృషి చేస్తాము” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ