దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా మళ్ళీ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. నవంబర్ 24, మంగళవారం నాడు కూడా 6224 కరోనా కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,621 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 4,943 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 4,93,419 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 91.3 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 38,501 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ ఢిల్లీ నగరంలో 59,14,659 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ