తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించింది. ఈ మేరకు హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా రాష్ట్ర బీజేపీ శాఖ మరియు కేసులోని నిందితులు దాఖలు చేసిన పిటీషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన ధర్మాసనం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై తమకు నమ్మకం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వారు తమ పిటీషన్లలో కోర్టుకి విన్నవించారు.
ఈ నేపథ్యంలో నేడు విచారణ సందర్భంగా సిట్ తరపున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. ఇప్పటికే కేసులో సిట్ దర్యాప్తును వేగవంతంగా చేస్తోందని, అలాగే దర్యాప్తులో పురోగతి కనిపిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, మళ్ళీ దర్యాప్తు ప్రక్రియ మొదటికి వస్తుందని, కావున సిట్ నేతృత్వంలోనే దర్యాప్తు కొనసాగేలా చూడాలని కోరారు. అయితే ఏజీ వాదనలకు అంగీకరించని ధర్మాసనం.. ఇకపై దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని, అలాగే ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐ అధికారులకు అందించాలని ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE