తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం, గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బుధవారం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలపై గవర్నర్ కు వివరించినట్టు తెలిపారు. భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసిన పోలీస్ అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేలా డీజీపిని ఆదేశించాలని కోరడంతో పాటు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీల సమస్యలు, బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళనను కూడా గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్టు బండి సంజయ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY