తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు ఇతర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుధానాచారి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితర నేతలు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ వెంట అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి వచ్చారు. తొలుత మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు నామినేషన్ పత్రాలను ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ కు అందించగా, ఆయన వాటిని అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు.
కాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే మండలిలోని 40మంది సభ్యులలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా 36మంది సభ్యులు ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా గతంలో మండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3వ తేదీతో పూర్తయింది. అయితే అప్పటినుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 12, 2023) ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE