సెప్టెంబర్ 17, 2022వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజులపాటుగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కూడా కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలు (సెప్టెంబర్ 16, 17, 18):
- సెప్టెంబర్ 16వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహణ.
- సెప్టెంబర్ 17న సీఎం పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.
- అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం బంజారా, ఆదివాసీ భవన్ ల ప్రారంభోత్సవం. నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
- సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు, కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY