నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ముర్ము సమయాభావం వల్ల తెలంగాణకు రాలేకపోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముర్ము మంగళవారం తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు మద్దతు కోరుతూ ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలులతో నేడు ద్రౌపది ముర్ము సమావేశం కావాల్సి ఉంది.
అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండటం, సమయాభావం తదితర కారణాల రీత్యా మంగళవారం హైదరాబాద్లో ప్రతిపాదిత పర్యటన రద్దు చేయబడిందని ముర్ము పర్యటన ఏర్పాట్లు చూస్తున్న సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ముర్ము పర్యటించాల్సి ఉండటంతో తెలంగాణ పర్యటన జరిగేది అనుమానంగా ఉంది. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు శాసనసభ్యుల మద్దతు కోరేందుకు ముర్ము వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. మరోవైపు ముర్ముపై పోటీకి విపక్షాల తరపున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యాశ్వంత్ సిన్హా నిలబడటం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ