తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 25, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. టీశాట్, డిజిటల్, టీవీ ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. అలాగే లెక్చరర్స్ అంతా ఆగస్టు 27 నుంచి తప్పనిసరిగా కాలేజీలకు హాజరై, విద్యార్థులకు ఈ-లెస్సన్స్ తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాలేజీల పునః ప్రారంభం, రెగ్యులర్ క్లాసులుపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి వేరే సూచనలు విడుదల చేస్తామని, అప్పటివరకు భౌతికంగా కాలేజీలు మూసి ఉంటాయని చెప్పారు. మరోవైపు అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని, కరోనా నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతాయని అన్నారు. ఇక డిగ్రీ, పీజీ చివరి సెమిస్టరు/సంవత్సరం పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాత, అందుకు అనుగుణంగా తేదీలపై నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu