ఆగస్టు 5, బుధవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను అనుసరించి రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. ఇక డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu