కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన 1216 మందిలో 937 మందిని గుర్తించినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు. ఇప్పటిదాకా గుర్తించిన వారికీ వైద్య పరీక్షలు నిర్వహించగా 18 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే పాజిటివ్ గా తేలిన 18 మందికి సంబంధించిన 79 మంది ప్రైమరీ కాంటాక్టులలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. మిగిలిన వారిని క్వారంటైన్ లో ఉంచి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. పాజిటివ్ గా తేలిన వారందరి శాంపిల్స్ ను జీనోమ్-సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపించినట్లు తెలిపారు.
#Update #Telangana-Out of 1216 #UK returnees-937 have been tracked n tested and 18 found positive for #COVID19 (including previous16).Out of 79 immediate contacts,3 tested positive,rest all have put under strict quarantine.All positive samples sent to #CCMB-for Genome-sequencing.
— Dr G Srinivasa Rao (@drgsrao) December 26, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ