తెలంగాణలో కరోనా ప్రభావం అదుపులోనే ఉంది. కొత్తగా 177 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 2, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,34,814 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 69 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.
మరోవైపు కరోనా నుంచి మరో 290 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,29,410 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,293 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్రవారం నాడు 14,271 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (177):
- హైదరాబాద్ – 69
- రంగారెడ్డి – 14
- మేడ్చల్ మల్కాజిగిరి – 9
- నల్గొండ – 8
- ఖమ్మం – 5
- మహబూబ్ నగర్ – 5
- నారాయణ్ పేట్ – 5
- మెదక్ – 5
- హనుమకొండ – 5
- సంగారెడ్డి – 5
- యాదాద్రి భువనగిరి – 4
- వనపర్తి – 4
- మహబూబాబాద్ – 4
- కరీంనగర్ – 4
- నిజామాబాద్ – 3
- మంచిర్యాల – 3
- సిద్ధిపేట – 3
- జగిత్యాల – 3
- రాజన్న సిరిసిల్ల – 2
- పెద్దపల్లి – 2
- ములుగు – 2
- కామారెడ్డి – 2
- జనగామ – 2
- ఆదిలాబాద్ – 2
- భద్రాద్రి కొత్తగూడెం – 2
- వికారాబాద్ – 1
- వరంగల్ రూరల్ – 1
- సూర్యాపేట – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- నాగర్ కర్నూల్ – 1
- జోగులాంబ గద్వాల్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY