టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీ రామారావు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు మద్దతు తెలిపారు. కాగా శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఆయన కలెక్టర్కు బాసటగా నిలిచారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో వారి మధ్య జరిగిన సంభాషణపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కలెక్టర్ పాటిల్కు మద్దతుగా నిలిచారు. ఇక దీనిపై స్పందిస్తూ.. ‘కామారెడ్డి జిల్లా కలెక్టర్తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన నన్ను భయపెట్టింది.. ఈ రాజకీయ నాయకులు కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను నిరుత్సాహపరుస్తారు. అయితే ఈ ఘటనలో హుందాగా ప్రవర్తించిన కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్కు నా అభినందనలు’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy
These political histrionics on the street will only demoralise hardworking AIS officers
My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct 👏
— KTR (@KTRTRS) September 2, 2022
ఇక పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి జిల్లా, బీర్కూర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆమె ఒక్కో కుటుంబానికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను దీనిపై ప్రశ్నించారు. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అని అడిగారు. అయితే కేంద్రమంత్రి ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించడంతో.. ఈ ఊహించని పరిణామానికి కలెక్టర్ కొంచెం తడబడ్డారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి నిర్మలా సీతారామన్, ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపైనే మంత్రి కేటీఆర్ స్పందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ