మహారాష్ట్ర రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2, శుక్రవారం నాడు 1,258 కరోనా కేసులు, 6 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 81,02,377 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,257 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 1,942 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 79,44,923 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.06 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.82 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 9,197 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మొత్తం 8,41,62,354 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY