తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1873 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 30, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో 9 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 827 కి పెరిగింది. ఆదివారం నాడు 37,791 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 13,65,582 కు చేరుకుంది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 360, కరీంనగర్ లో 180, రంగారెడ్డి జిల్లాలో 129, ఖమ్మంలో 103, నిజామాబాద్ లో 94, వరంగల్ అర్బన్ లో 94, సిద్ధిపేటలో 85, నల్గొండలో 79, జగిత్యాలలో 77, సూర్యాపేటలో 65, మహబూబాబాద్ లో 54, భద్రాద్రి కొత్తగూడెంలో 51,
నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 30, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 13,65,582
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 1,24,963
- కొత్తగా నమోదైన కేసులు : 1873
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 92,837
- కరోనా రికవరీ రేటు: 73.3%
- యాక్టీవ్ కేసులు: 31,299
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 24,216
- మొత్తం మరణాల సంఖ్య : 827
- కరోనా మరణాల రేటు: 0.66%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu