తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2534 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 9, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,50,176 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 927 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.61 (< 1%) శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2071 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,17,143 కి చేరింది. ప్రస్తుతం 32,106 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 78 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 327, రంగారెడ్డిలో 195, నల్గొండలో 149, మేడ్చల్ లో 132, వరంగల్ అర్బన్ లో 124, కామారెడ్డిలో 123, ఖమ్మంలో 109, కరీంనగర్ లో 107, సిద్దిపేటలో 103, సంగారెడ్డిలో 96, నిజామాబాద్ లో 90 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu