ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 95,366 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,925 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 611, చిత్తూరులో 414, పశ్చిమగోదావరిలో 361, ప్రకాశంలో 260, కృష్ణాలో 250 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,20,178 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 26 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12986 కి పెరిగింది. గత 24 గంటల్లో 3,937 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,77,930 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ