పార్టీ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్, పార్లమెంట్ లో వ్యూహంపై కీలక చర్చ

CM KCR, CM KCR will Conduct a Meeting with Party MPs, KCR Meeting with Party MPs, lok sabha, Parliament, Parliament Sessions, Parliament Sessions 2020, rajya sabha, Strategy in Parliament Sessions, telangana, Telangana CM KCR, Telangana Political News, Telangana Political News Today, Telangana Political Updates

సెప్టెంబర్ 14 వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 14 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వ విధానం, జీఎస్టి విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఎంపీలకు వివరాలు అందించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =