తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇటీవల రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 2861 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 31, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,63,911 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 4,413 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,22,654 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.60 శాతంగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,089 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,168 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 746, మేడ్చల్ మల్కాజ్గిరిలో 234, రంగారెడ్డిలో 165, ఖమ్మంలో 130, నల్గొండలో 104, హనుమకొండలో 96, కరీంనగర్ లో 96, సంగారెడ్డిలో 91, భద్రాద్రి కొత్తగూడెంలో 91 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ