రంజీట్రోపి 2022 సవరించిన షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. లీగ్ దశ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 13 నుంచి ఆడాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. అయితే, ఇటీవల రీ షెడ్యూల్ని ప్రకటిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఈమేరకు ఇప్పుడు లీగ్ దశ షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. రంజీ ట్రోఫీలో మొత్తం 38 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మ్యాచ్లు 8 నగరాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం రంజీ మ్యాచ్లు అహ్మదాబాద్, కోల్కతా, త్రివేండ్రం, కటక్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, రాజ్కోట్లలో జరుగుతాయి.
అలాగే రంజీ ట్రోఫీ ఫార్మాట్ను బీసీసీఐ మార్చినట్లు తెలిసింది. నాలుగు జట్లతో కూడిన ఎనిమిది గ్రూపులను కలిగి ఉంటుంది. అందులో ప్లేట్ గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. గత సీజన్లో రంజీ ట్రోఫీ రద్దు కావడంతో పరిహారం పొందిన దేశవాళీ క్రికెటర్లు.. టోర్నీని రెండు దశల్లో నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జే షా గతంలో ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, టోర్నీలో ఏ ఒక్క ఆటగాడికి కరోనా సోకినా ఆ ప్రభావం మొత్తం టోర్నీపై పడనుంది. అయితే, కరోనా నివారణకు బీసీసీఐ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ