ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను “పట్టాభి రామబాణం” పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభి రామబాణం 250వ ఎపిసోడ్ కు చేరుకుంది. ఇప్పటికే 249 ఎపిసోడ్స్ చూసి, నిరంతరంగా అనుసరిసస్తూ ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ బీవీ పట్టాభిరామ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 250 ఎపిసోడ్ లో ‘SYNERGY(సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. నా ఆలోచన+నీ ఆలోచన= మన ఆలోచన అనే సమిష్టి చర్యగా మారుతుందని చెప్పారు.
డాక్టర్ బీవీ పట్టాభిరామ్ సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్లో పిజి డిప్లొమా మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి యోగా అండ్ హిప్నోటిజం-ఎ ప్రాగ్మాటిక్ అప్రోచ్ పై పిహెచ్డి చేశారు. దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్ స్కిల్స్, హెచ్ఆర్డిపై ఎన్నో వర్క్షాప్లు నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా వ్యక్తిత్వ వికాస పుస్తకాల ద్వారా ఎందరో విద్యార్థుల గొప్ప భవిష్యత్ కు బాటలు వేసి, కౌన్సెలింగ్ ద్వారా మరెందరో జీవితాల్లో బీవీ పట్టాభిరామ్ వెలుగులు నింపారు. ఈ క్రమంలో అందివచ్చిన టెక్నాలజీ ద్వారా వారి అమూల్యమైన సలహాలు, సూచనలతో విద్యార్థులు, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ లో పట్టాభి రామబాణాన్ని ఎక్కుపెట్టారు. ఈ కార్యక్రమం 250వ ఎపిసోడ్ కి చేరుకున్న సందర్భంగా శ్రీ బీవీ పట్టాభిరామ్ గారికి మ్యాంగో న్యూస్ అభినందనలు తెలుపుతుంది.
SYNERGY అంశంపై పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇