తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,391 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే మరో ఇద్దరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1529 కి పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 536 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,76,244 కు చేరుకుంది. ప్రస్తుతం 6,618 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 67 లక్షలుకు చేరువైంది. శుక్రవారం నాడు 30,376 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 66,86,363 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,79,644 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ