కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకే నుండి, యూకే మీదుగా తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు మొత్తం 1200 మంది రాగా అందులో 926 మందిని గుర్తించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటిదాకా గుర్తించిన వారికీ వైద్య పరీక్షలు నిర్వహించగా 16 గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.
ఇందులో హైదరాబాద్లో 4, మేడ్చల్లో 4, జగిత్యాలలో 2, మంచిర్యాలలో 2, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఒక్కో కేసు నమోదైందన్నారు. ఈ 16 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అలాగే వీరిలో ఏరకం కరోనా వైరస్ ఉందో తెలుసుకోవడానికి శాంపిల్స్ సీసీఎంబీకి పంపించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పాజిటివ్ గా తేలిన 16 మందికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్టులను కూడా గుర్తించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ