తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 334 కు చేరింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మృతి చెందగా, 33 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 290 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఏప్రిల్ 6 సోమవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం రాత్రి నుంచి కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా అనంతపూర్ జిల్లాలో ఒకరు, కృష్ణ జిల్లాలో ఒకరు కరోనా వలన మరణించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో మర్కజ్ సమావేశానికి హాజరైన వారు, వారితో కాంటాక్ట్ లో ఉన్నవారే ఉండడం విశేషం.
తెలంగాణలో ఈరోజు మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. మొత్తం 33 మంది కోలుకున్నారు. 290 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. pic.twitter.com/bWGCZEvgEu
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 5, 2020
#CovidUpdates: రాష్ట్రం లో కొత్తగా 14 కోవిడ్ పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. వీటి తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 266 కి పెరిగింది. రాష్ట్రం లో కోవిడ్ కారణం వల్ల కొత్తగా అనంతపూర్, కృష్ణ జిల్లాలో ఒక్కో మరణం నమోదయ్యాయి @AndhraPradeshCM @MoHFW_INDIA pic.twitter.com/SHqGoD81ZE
— ArogyaAndhra (@ArogyaAndhra) April 6, 2020