బియ్యం కార్డు ఉన్నవారికి లేదా దారిద్యరేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించే “వైఎస్ఆర్ బీమా” పథకాన్ని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ బీమా పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్ఆర్ బీమా పథకం విధివిధానాలు:
- ఆపద సమయంలో లబ్ధిదారుని కుటుంబాలకు అదేరోజున తక్షణ సాయం కింద గ్రామ సచివాలయం నుంచి రూ.10 వేలు అందజేత.
- వైఎస్ఆర్ బీమా పథకానికి అర్హత గలవారు వారి పేర్లను ఎప్పుడైనా గ్రామా సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చు.
- వాలంటీర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్ ద్వారా సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు సమాచారం అందిస్తారు. వారి ద్వారా లబ్ధిదారుని కుటుంబాలకు ఈ సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఈ పథకం కోసం ప్రతి గ్రామ సచివాలయంలో రూ.20 వేలు డిపాజిట్ చేయనున్నారు.
- జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్లు ఆయా జిల్లాల పరిధిలో క్లెయిమ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి.
- ఈ పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు.
- సాధారణ మరణం అయితే లబ్ధిదారుని నామినీకి 15 రోజుల వ్యవధిలో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందే ఏర్పాటు.
- ప్రమాదవశాత్తు మరణిస్తే 21 రోజుల వ్యవధిలో ఇన్సూరెన్స్ డబ్బులు అందజేసే ఏర్పాటు.
- ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికీ 55 రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా క్లెయిమ్ రూపంలో డబ్బులు అందేలా ఏర్పాటు. .
- ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డబ్బులు అందించే విషయంలో లబ్ధిదారుని కుటుంబానికి వాలంటీర్, సచివాలయ సిబ్బంది తోడ్పాటు అందిస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ