తెలంగాణ రాష్ట్రంలో మరో 474 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 29, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,85,939 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1538 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 592 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,78,523 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.40 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 5,878 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 102, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ లో 45, కరీంనగర్ లో 29, వరంగల్ అర్బన్ లో 25, భద్రాద్రి కొత్తగూడెంలో 18, మంచిర్యాలలో 14, సిద్దిపేటలో 14, సిద్ధిపేట 14 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ