నకిరేకల్ తో పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరందించే బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన అభ్యర్థన మేరకు ఉదయ సముద్రం ప్రాజెక్టు సత్వరమే పూర్తికావడానికి భూసేకరణ, టన్నల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటితో పాటు పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తి చేసేందుకు కావలసిన చర్యలను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ