తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7754 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,43,360 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 51 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2312 కి పెరిగింది. కొత్తగా 6542 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 3,62,160 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1507 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 30, రాత్రి 8 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,29,83,784
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 4,43,360
- కొత్తగా నమోదైన కేసులు : 7754
- నమోదైన మరణాలు : 51
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 3,62,160
- కరోనా రికవరీ రేటు: 81.68%
- యాక్టీవ్ కేసులు: 78,888
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 2312
- కరోనా మరణాల రేటు: 0.52%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ