దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 18 కోట్లకుపైగా (18,00,03,160) కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 11, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 17,09,71,429 డోసులను వినియోగించారని చెప్పారు. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రస్తుతం 90 లక్షలకుపైగా (90,31,691) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో 7 లక్షలకుపైగా (7,29,610) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ