తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15, 2021 నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,82,497 మంది ఓటు హక్కు పొందినట్టు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 43,11,803 ఓటర్లు ఉండగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 30,97,677 ఉన్నారు. ఇక ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,14,291 మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణ ఓటర్ల జాబితా వివరాలు:
- రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య : 119
- మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంఖ్య : 34,708
- రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సంఖ్య : 3,01,65,569
- పురుష ఓటర్లు సంఖ్య : 1,51,61,714
- మహిళా ఓటర్లు సంఖ్య : 1,50,02,227
- థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య : 1,628
- కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య : 2,82,497
- సర్వీస్ ఓటర్ల సంఖ్య : 13,703
- తొలగించిన ఓటర్ల సంఖ్య : 1,72,255
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ