బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు పోలీసులు భద్రతను పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో సంజయ్కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆయనకు అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించారు. అలాగే 1+5 విధానంలో సంజయ్ సెక్యూరిటీకి రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇటీవల బండి సంజయ్ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక సమర్పించింది. కాగా దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరైన బండి సంజయ్ తన పర్యటనల సందర్భంగా కానీ, సమావేశాలలో మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉంటారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటుగా హైద్రాబాద్ పరిధిలోని ఎమ్ఐఎమ్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తుంటారు. అలాగే ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సంజయ్కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY