తెలంగాణ బేస్ బాల్ క్రీడాకారులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Baseball Players, Hyderabad Baseball Club, Mango News, ports Minister Srinivas Goud Appreciated Telangana Baseball Players, Sports Minister Srinivas Goud, Sports Minister Srinivas Goud Appreciated State Baseball Players, State Baseball Players, Telangana Baseball, Telangana Baseball Players, Telangana Baseball Players 2021, Telangana Baseball Players Won, Telangana Sports Minister Srinivas Goud, Telangana Sports Minister Srinivas Goud Appreciated State Baseball Players

మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టుపై 11-6 పాయింట్ లతో విజయం సాధించి జాతీయ ఛాంపియన్ షిప్ ను సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ బేస్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేతృత్వంలో వచ్చిన క్రీడాకారులను, కోచ్ లను, అసోసియేషన్ ప్రతినిధులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్రంలో క్రీడా పాలసీని ప్రవేశపెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, ట్రెజరర్ కృష్ణ, కోచ్ లు శ్రీకాంత్ మోగిలి, కృష్ణ, సాయికుమార్, మేనేజర్ రాహుల్, క్రీడాకారులు, క్రీడాకారిణిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 2 =